Telugu Global
Others

ఆస్తులమ్మండి బాబు... 4 రెట్లకు అమ్మిపెడతాం

ఇటీవల చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రకటించిన ఆస్తులను నాలుగు రెట్లు అధిక ధరకు అమ్మిపెడతామని వైసీపీ ఆఫర్ చేస్తోంది.  అమ్ముతామని ఒక్కమాట చెబితే వెంటనే పార్టీని తీసుకొస్తామని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్ ప్రకటించిన లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని అంబటి ఆరోపించారు. ఆ లెక్కలను టీడీపీ నేతలే నమ్మడం లేదన్నారు.  తన ఆస్తి విలువ 42 లక్షలు మాత్రమే అంటున్న చంద్రబాబు నిజాయితీ ఉంటే వాటికి నాలుగు రెట్ల అధిక ధర చెల్లించేందుకు […]

ఆస్తులమ్మండి బాబు... 4 రెట్లకు అమ్మిపెడతాం
X

ఇటీవల చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రకటించిన ఆస్తులను నాలుగు రెట్లు అధిక ధరకు అమ్మిపెడతామని వైసీపీ ఆఫర్ చేస్తోంది. అమ్ముతామని ఒక్కమాట చెబితే వెంటనే పార్టీని తీసుకొస్తామని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్ ప్రకటించిన లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని అంబటి ఆరోపించారు. ఆ లెక్కలను టీడీపీ నేతలే నమ్మడం లేదన్నారు. తన ఆస్తి విలువ 42 లక్షలు మాత్రమే అంటున్న చంద్రబాబు నిజాయితీ ఉంటే వాటికి నాలుగు రెట్ల అధిక ధర చెల్లించేందుకు సిద్ధపడే వారికి అమ్మాలని డిమాండ్ చేశారు. ఆస్తులపై రిటైర్డ్ జడ్జీతో విచారణకు సిద్ధమా అని అంబటి ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ఐదెకరాల భూమి విలువ 72 లక్షలు మాత్రమే అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. 42 లక్షల ఆస్తి పరుడు పాత భవనాన్ని కూల్చేసి విలాసవంతమైన భవంతి ఎలా నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలు, కూరగాయలు అమ్ముకునే వారెవరైనా దేశంలో కోట్లాదిరూపాయలు సంపాదించిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు దోచుకున్న సొమ్మును దొంగపూర్ లాంటి సింగపూర్‌లో దాస్తున్నారని అంబటి ఆరోపించారు.

First Published:  29 Sep 2015 3:08 AM GMT
Next Story