నకిలీ పాస్ పుస్తకాలు తయారీ ముఠా అరెస్ట్
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేసి అమాయక రైతులను మోసం చేస్తున్న ముఠాను వరంగల్ జిల్లా మానుకోట పోలీసులు అరెస్ట్ చేశారు. మానుకోట టౌన్ సీఐ నందిరాం నాయక్ కథనం ప్రకారం… గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన భూక్యా మంగీలాల్ నేతృత్వంలో కొందరు సభ్యుల ముఠా నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి అమాయక రైతులకు అంటగడుతూ డబ్బులు వసూలు చేస్తోంది. వీరిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. […]
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేసి అమాయక రైతులను మోసం చేస్తున్న ముఠాను వరంగల్ జిల్లా మానుకోట పోలీసులు అరెస్ట్ చేశారు. మానుకోట టౌన్ సీఐ నందిరాం నాయక్ కథనం ప్రకారం… గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన భూక్యా మంగీలాల్ నేతృత్వంలో కొందరు సభ్యుల ముఠా నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి అమాయక రైతులకు అంటగడుతూ డబ్బులు వసూలు చేస్తోంది. వీరిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. వీరి నుంచి కంప్యూటర్, ప్రింటర్, రబ్బర్ స్టాంపులు, నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.