Telugu Global
Others

ప్ర‌కాశం జిల్లాలో న‌ర‌బ‌లి!

ప్ర‌కాశం జిల్లాలో దారుణం జ‌రిగింది. క్షుద్ర‌పూజ‌ల‌ కోసం నాలుగేళ్ల బాలుడిని బ‌లిచ్చిన ఘ‌ట‌న జిల్లాలోని వ‌లేటివారి మండ‌లంలోని పోకూరు ఎస్సీ కాల‌నీలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. బి.మ‌హేంద‌ర్‌, ఆదిల‌క్ష్మిల కుమారుడు మ‌నుసాగ‌ర్ (4) రోజులాగే బుధ‌వారం ఉద‌యం స‌మీపంలోని అంగ‌న్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి మనుసాగ‌ర్ ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లి వెళ్లి వాక‌బు చేయ‌గా తిరుమ‌ల‌రావు అనే వ్య‌క్తి తీసుకెళ్లిన‌ట్లుగా చూసిన‌వారు చెప్పారు. దీంతో తిరుమ‌ల‌రావు ఇంటికి వెళ్లి అత‌డిని నిల‌దీసింది ఆదిల‌క్ష్మి. తొలుత త‌న‌కు […]

ప్ర‌కాశం జిల్లాలో దారుణం జ‌రిగింది. క్షుద్ర‌పూజ‌ల‌ కోసం నాలుగేళ్ల బాలుడిని బ‌లిచ్చిన ఘ‌ట‌న జిల్లాలోని వ‌లేటివారి మండ‌లంలోని పోకూరు ఎస్సీ కాల‌నీలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. బి.మ‌హేంద‌ర్‌, ఆదిల‌క్ష్మిల కుమారుడు మ‌నుసాగ‌ర్ (4) రోజులాగే బుధ‌వారం ఉద‌యం స‌మీపంలోని అంగ‌న్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి మనుసాగ‌ర్ ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లి వెళ్లి వాక‌బు చేయ‌గా తిరుమ‌ల‌రావు అనే వ్య‌క్తి తీసుకెళ్లిన‌ట్లుగా చూసిన‌వారు చెప్పారు. దీంతో తిరుమ‌ల‌రావు ఇంటికి వెళ్లి అత‌డిని నిల‌దీసింది ఆదిల‌క్ష్మి. తొలుత త‌న‌కు తెలియ‌ద‌ని తిరుమ‌ల‌రావు బుకాయించాడు. దీంతో ఇంటి లోప‌లికి వెళ్లి చూడ‌గా ర‌క్త‌పుమ‌డుగులో బాలుడు శ‌వ‌మై క‌నిపించాడు. మ‌నుసాగ‌ర్ మెడ తెగి ఉంది. ఆగ్ర‌హంతో గ్రామ‌స్తులు తిరుమ‌ల‌రావును స్తంభానికి క‌ట్టేసి చిత‌క‌బాదారు. కిరోసిన్ పోసి నిప్పంటిచబోతుండ‌గా పోలీసులు వ‌చ్చి అడ్డుకున్నారు. దీనిపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

First Published:  30 Sep 2015 1:05 PM GMT
Next Story