Telugu Global
CRIME

ఉంగుటూరులో 40 తులాల బంగారం చోరీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీలో  40 తులాల బంగారంతోపాటు కొంత మొత్తం నగదును దొంగలు అపహరించారు. జిల్లాలో తరచూ చోరీలు జరుగుతున్నా పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. రాత్రిపూట సరైన గస్తీ లేకపోవడం, పెట్రోలింగ్‌ చేసే వాహనాల హడావుడి ఎక్కడా కనిపించక పోవడం దొంగలు రెచ్చిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ఉంగుటూరు సంఘటన కూడా ఈనేపథ్యంలోనే జరిగిందన్నది నిజం. దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు […]

పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీలో 40 తులాల బంగారంతోపాటు కొంత మొత్తం నగదును దొంగలు అపహరించారు. జిల్లాలో తరచూ చోరీలు జరుగుతున్నా పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. రాత్రిపూట సరైన గస్తీ లేకపోవడం, పెట్రోలింగ్‌ చేసే వాహనాల హడావుడి ఎక్కడా కనిపించక పోవడం దొంగలు రెచ్చిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ఉంగుటూరు సంఘటన కూడా ఈనేపథ్యంలోనే జరిగిందన్నది నిజం. దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.​
First Published:  3 Oct 2015 3:07 PM GMT
Next Story