Telugu Global
CRIME

తెనాలి ప్రేమికుడు- ప్రేయసి కోసం వెళ్తే పైకి పంపించారు!

ప్రియురాలి కోసం పక్క రాష్ట్రం వెళ్లిన తెనాలి ప్రేమికుడు దారుణహత్యకు గురయ్యాడు. కర్నాటకలోని రాయచూర్‌ సమీపంలో శవమై తేలాడు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన కరప మధు కొద్ది రోజుల క్రితం పోస్టల్ ఉద్యోగం కోసం కోచింగ్‌కు వెళ్లేవాడు. రాయచూర్‌కు చెందిన శ్వేత కుమారి కూడా కోచింగ్ కోసం తెనాలి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేసింది. అయితే కొద్దికాలానికి కోచింగ్ పూర్తవడంతో శ్వేత కుమారి రాయచూర్ ట్రైన్ ఎక్కేసింది. అయినా వీరి […]

తెనాలి ప్రేమికుడు- ప్రేయసి కోసం వెళ్తే పైకి పంపించారు!
X

ప్రియురాలి కోసం పక్క రాష్ట్రం వెళ్లిన తెనాలి ప్రేమికుడు దారుణహత్యకు గురయ్యాడు. కర్నాటకలోని రాయచూర్‌ సమీపంలో శవమై తేలాడు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన కరప మధు కొద్ది రోజుల క్రితం పోస్టల్ ఉద్యోగం కోసం కోచింగ్‌కు వెళ్లేవాడు. రాయచూర్‌కు చెందిన శ్వేత కుమారి కూడా కోచింగ్ కోసం తెనాలి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేసింది. అయితే కొద్దికాలానికి కోచింగ్ పూర్తవడంతో శ్వేత కుమారి రాయచూర్ ట్రైన్ ఎక్కేసింది. అయినా వీరి ప్రేమ మాత్రం సెల్‌ఫోన్ సాయంతో చక్కగా సాగిపోయింది.

గత నెల 25న రాయచూర్‌ రావాల్సిందిగా ప్రియురాలు శ్వేత నుంచి కాల్ వచ్చింది. ఆలస్యం చేయకుండా ఆనందంగా రైలెక్కి వెళ్లాడు మధు. కానీ ఆ తర్వాత ఏమైందో గానీ రాయచూర్ సమీపంలోని కురిడీ గ్రామం వద్ద శవమై కనిపించాడు. మృతదేహం వద్ద దొరికిన ఆనవాళ్లు బట్టి తెనాలి పోలీసులకు రాయచూర్ పోలీసులు సమాచారం అందించారు. మధు తల్లిదండ్రులకు శనివారం పోలీసులు విషయం తెలియజేశారు. శ్వేత కుమారి తరపువారే తమ వాడిని హత్య చేశారని మధు తల్లి ఆరోపిస్తున్నారు.

First Published:  3 Oct 2015 3:05 PM GMT
Next Story