Telugu Global
NEWS

నిజామాబాద్‌లో మొదలైన షర్మిల యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్‌లో రెండ్రోజుల పాటు షర్మిల పర్యటిస్తారు. ఈ జిల్లాలో ఆమె మొత్తం 214 కి.మీ. మేర పర్యటించి 12 కుటుంబాలను పరామర్శిస్తారు. వైఎస్ రాజశేఖర్ […]

నిజామాబాద్‌లో మొదలైన షర్మిల యాత్ర
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్‌లో రెండ్రోజుల పాటు షర్మిల పర్యటిస్తారు. ఈ జిల్లాలో ఆమె మొత్తం 214 కి.మీ. మేర పర్యటించి 12 కుటుంబాలను పరామర్శిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు వివిధ జిల్లాలో షర్మిల విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఆదిలాబాద్‌లో మూడ్రోజుల పాటు పర్యటించి మొత్తం 10 కుటుంబాలను పరామర్శించారు. మూడోరోజు పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల మూడు కుటుంబాలను ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని ఆమె భరోసా కల్పించారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడదామని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామన్నారు.

First Published:  5 Oct 2015 11:15 AM GMT
Next Story