Telugu Global
CRIME

అమెరికాలో ఇండియన్‌ రూ. ఫోర్‌ట్వంటీ(కోట్లు) !

ఐఐటీలో చదివాడు… ఆపై చదువును హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో పూర్తి చేశాడు. మంచి అర్హతలుండడంతో అమెరికాలోని ఓ కంపెనీలో వెంచర్‌ క్యాపిటలిస్టుగా చేరాడు. అంతా బాగుంది. మనసులో దొలిచిన పురుగు అతన్ని ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పురిగొల్పింది. ఇలా రూ. 420 కోట్లకు క్లయింట్లను మోసం చేశాడు. ఇప్తికార్‌ అహ్మద్‌ అనే ఈ క్రిమినల్‌ ఇప్పుడు భారతదేశంలో దాగున్నాడని అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలకు ముందు ఏదో ఒక సమయంలో అమెరికా నుంచి పారిపోయాడని, ఇప్పుడు ఎక్కడున్నదీ […]

ఐఐటీలో చదివాడు… ఆపై చదువును హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో పూర్తి చేశాడు. మంచి అర్హతలుండడంతో అమెరికాలోని ఓ కంపెనీలో వెంచర్‌ క్యాపిటలిస్టుగా చేరాడు. అంతా బాగుంది. మనసులో దొలిచిన పురుగు అతన్ని ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పురిగొల్పింది. ఇలా రూ. 420 కోట్లకు క్లయింట్లను మోసం చేశాడు. ఇప్తికార్‌ అహ్మద్‌ అనే ఈ క్రిమినల్‌ ఇప్పుడు భారతదేశంలో దాగున్నాడని అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలకు ముందు ఏదో ఒక సమయంలో అమెరికా నుంచి పారిపోయాడని, ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియడంలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) వర్గాలు అంటున్నాయి. నిజానికి ఓక్ ఇన్వెస్ట్ మెంట్ పార్ట్ నర్స్ లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న అహ్మద్, తన క్లయింట్లను కోట్లాది డాలర్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి. అతడి స్నేహితుడు అమిత్ కనోడియాతో కలిపి అహ్మద్ ను ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత జడ్జి ఉత్తర్వులను ఉల్లంఘించి పారిపోయాడని చెబుతున్నారు. అతడు దొరికి, నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
First Published:  8 Oct 2015 3:09 PM GMT
Next Story