Telugu Global
National

బిగ్‌ బజార్‌లో ఇక రాందేవ్‌ సంస్థ ఉత్పత్తులు!

యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తులను 240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. అంటే ఇకనుంచి బిగ్‌ బజార్లలో రాందేవ్‌ సంస్థ ఉత్పత్తులు దొరుకుతాయన్న మాట. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ […]

బిగ్‌ బజార్‌లో ఇక రాందేవ్‌ సంస్థ ఉత్పత్తులు!
X
యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తులను 240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. అంటే ఇకనుంచి బిగ్‌ బజార్లలో రాందేవ్‌ సంస్థ ఉత్పత్తులు దొరుకుతాయన్న మాట. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లాంటి స్వదేశీ రిటైల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థకు రెట్టింపు గౌరవం దక్కుతుందని, తద్వారా ప్రపంచ శ్రేణి ఉత్పత్తుతులను తక్కువ ధరకే అందించే వీలుంటుందన్నారు. 2015- 16 ఆర్ధిక సంవత్సరంలో పూర్తయ్యేలోపు పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని రాందేవ్ చెప్పారు.
First Published:  9 Oct 2015 10:32 AM GMT
Next Story