Telugu Global
Cinema & Entertainment

"షేర్‌"తో టీడీపీ భావాలు దెబ్బతింటున్నాయట!

ఎన్టీఆర్ ఫ్యామిలీ హీరో కల్యాణ్ రామ్ నటించిన షేర్ మూవీ ట్రైలర్ ఒకటి విడుదలైంది. టీవీల్లో పదేపదే ప్రసారం అవుతోంది. అందులో ఓ డైలాగ్ జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే ఆ డైలాగ్ వినిపించిన ప్రతిసారి తెలుగుతమ్ముళ్లకు ఎక్కడో కాలుతోందట. సదరు ట్రైలర్‌లో ”పోలవరం ప్రాజెక్టు… వీడి పెళ్లి జరిగినట్టే ఉంటాయి కానీ జరగవు చిరాగ్గా” అన్న డైలాగే ఇప్పుడు టీడీపీ వాళ్లకు కోపం తెప్పిస్తోందట. ఇది నేరుగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై విసిరిన సెటైరేనని […]

షేర్‌తో టీడీపీ భావాలు దెబ్బతింటున్నాయట!
X

ఎన్టీఆర్ ఫ్యామిలీ హీరో కల్యాణ్ రామ్ నటించిన షేర్ మూవీ ట్రైలర్ ఒకటి విడుదలైంది. టీవీల్లో పదేపదే ప్రసారం అవుతోంది. అందులో ఓ డైలాగ్ జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే ఆ డైలాగ్ వినిపించిన ప్రతిసారి తెలుగుతమ్ముళ్లకు ఎక్కడో కాలుతోందట.

సదరు ట్రైలర్‌లో ”పోలవరం ప్రాజెక్టు… వీడి పెళ్లి జరిగినట్టే ఉంటాయి కానీ జరగవు చిరాగ్గా” అన్న డైలాగే ఇప్పుడు టీడీపీ వాళ్లకు కోపం తెప్పిస్తోందట. ఇది నేరుగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై విసిరిన సెటైరేనని బాధపడుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే చంద్రబాబు నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే కాలపరిమితి వినిపిస్తున్నారు.

పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఈ డైలాగ్ పేల్చారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఏమన్నా అందామంటే సినిమా కల్యాణ్ రామ్‌ది అయిపోయే! అందుకే టైలర్ కనిపించగానే చానల్ మార్చే పని పెట్టుకున్నారట.

First Published:  12 Oct 2015 8:00 AM GMT
Next Story