Telugu Global
Others

అద్దె గర్భంపై సుప్రీం ఆగ్రహం

సరోగసికి భారతదేశం ఒక కేంద్రంగా మారడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సరోగసికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కమర్షియల్ సరోగసిపై నిషేధం విధించాలని సూచించింది. ఒక పద్దతిపాడు లేకుండా దేశంలో సరోగసి తతంగం నడుస్తుండడంపై మండిపడింది. స్పష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్… సరోగసికి సంబంధించిన బిల్లు త్వరలోనే పార్లమెంట్‌ ముందుకు వస్తుందని కోర్టుకు తెలియజేశారు. సరోగసిపై కేంద్రానికి […]

అద్దె గర్భంపై సుప్రీం ఆగ్రహం
X

సరోగసికి భారతదేశం ఒక కేంద్రంగా మారడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సరోగసికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కమర్షియల్ సరోగసిపై నిషేధం విధించాలని సూచించింది. ఒక పద్దతిపాడు లేకుండా దేశంలో సరోగసి తతంగం నడుస్తుండడంపై మండిపడింది. స్పష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్… సరోగసికి సంబంధించిన బిల్లు త్వరలోనే పార్లమెంట్‌ ముందుకు వస్తుందని కోర్టుకు తెలియజేశారు. సరోగసిపై కేంద్రానికి పలు ప్రశ్నలకు కోర్టు సంధించింది. అద్దె గర్భం వల్ల మహిళలు వ్యాపార వస్తువుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసంది.

సరోగసి అంటే ఏమిటి?
వృత్తి రిత్యా కానీ. అనారోగ్య సమస్యల వల్ల గానీ సొంతంగా పిల్లలను కనలేని ధనిక మహిళలు ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు. పిల్లల కావాలనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది. సరోగసి ప్రక్రియ విధానంలో భార్యభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరింపజేసి అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అండం లేదా వీర్యం లభించకపోతే దాతల నుంచి సేకరిస్తారు. ప్రపంచంలోని చాలా దేశాల వారు పిల్లలను సరోగసి ద్వారా కనాలనుకుంటే తొలుత భారత్‌ వైపే వస్తున్నారు.

యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటినా, బ్రెజిల్, ఐర్లాండ్, మంగోలియా, ఇజ్రాయిల్ ఇలా పలుదేశాల వారు మన దేశానికి వస్తున్నారు. అన్ని దేశాలను వదలేసి మన దేశానికే రావడానికి కారణం ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే. తక్కువ ధరకే సరోగసి తల్లులు మన దేశంలో దొరుకుతున్నారు. పేద మహిళలకు సొమ్ము ఆశచూపి సరోగసి ద్వారా పిల్లలను తీసుకెళ్తున్నారు. అభివృద్ధిలో నెంబర్ వన్ అని చెప్పుకునే గుజరాత్‌ ఈ విషయంలోనూ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఈ తంతు ఎక్కువైంది. 2012 అధ్యయనం ప్రకారమే దేశంలో ఏటా 3వేల మంది సరోగసి ద్వారా పిల్లలను కనిపెడుతున్నారు. ఇప్పుడది మరింత పెరిగింది.

First Published:  14 Oct 2015 10:59 PM GMT
Next Story