Telugu Global
Others

కేసీఆర్ ప్రసంగానికి ఏపీ ప్రజల జేజేలు!

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తుండగా ప్రజలు హర్షధ్వానాలు పలికారు. చప్పట్లతో హోరెత్తించారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరగడం శుభసూచకని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వం తరుఫున అన్ని రకాల సాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. […]

కేసీఆర్ ప్రసంగానికి ఏపీ ప్రజల జేజేలు!
X

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తుండగా ప్రజలు హర్షధ్వానాలు పలికారు. చప్పట్లతో హోరెత్తించారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరగడం శుభసూచకని కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వం తరుఫున అన్ని రకాల సాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు, ప్రజానిధులకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని…అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

First Published:  22 Oct 2015 7:45 AM GMT
Next Story