Telugu Global
CRIME

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు హైదరాబాదీల దుర్మరణం

ప్రమాదవశాత్తు ఇన్నోవా కారు బోల్తా పడి హైదరాబాద్‌కు చెందిన ఐదురుగు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేర్ వద్ద జాతీయ రహదారి 44పై జరిగింది. హైదరాబాద్‌లోని బేగంబజారులో శుభలేఖలు, అల్లం, వెల్లుల్లిని విక్రయించే ఐదుగురు వ్యాపారులు కలిసి ఇన్నోవా కారులో హైదరాబాద్ నుంచి కేరళ రాష్ర్టానికి విహారయాత్రతోపాటు వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఎన్‌హెచ్-44 వద్దకు రాగానే కారు ముందు టైర్ పగిలిపోయింది. అతివేగంగా వెళుతున్న […]

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు హైదరాబాదీల దుర్మరణం
X

ప్రమాదవశాత్తు ఇన్నోవా కారు బోల్తా పడి హైదరాబాద్‌కు చెందిన ఐదురుగు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేర్ వద్ద జాతీయ రహదారి 44పై జరిగింది. హైదరాబాద్‌లోని బేగంబజారులో శుభలేఖలు, అల్లం, వెల్లుల్లిని విక్రయించే ఐదుగురు వ్యాపారులు కలిసి ఇన్నోవా కారులో హైదరాబాద్ నుంచి కేరళ రాష్ర్టానికి విహారయాత్రతోపాటు వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఎన్‌హెచ్-44 వద్దకు రాగానే కారు ముందు టైర్ పగిలిపోయింది. అతివేగంగా వెళుతున్న కారు టైర్ పగిలిపోయే సరికి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఎంఏ సత్తార్ (59), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (46), మహ్మద్ ఇజాజ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నిస్సన్‌ను 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇన్నోవా కారు యజమాని మహ్మద్ మజారుద్దీన్ ఫహీవ్ (48) తీవ్రంగా గాయపడగా, అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

First Published:  22 Oct 2015 4:00 PM GMT
Next Story