Telugu Global
Others

రఘువీరా తన్నులు తింటావ్‌, జగన్‌కు ముట్టింది 20శాతమే

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిధి మించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రఘువీరారెడ్డి పద్దతి మార్చుకోకుంటే బట్టలూడదీసి కొడుతానంటూ వ్యాఖ్యనించారు. రాజశేఖర్ రెడ్డి శవం పక్కన ఉండగానే జగన్‌కు లేనిపోనివి చెప్పి ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది రఘువీరారెడ్డేనని విమర్శించారు. అప్పట్లో సంపాదించిన దాంట్లో పిల్లాడైన జగన్‌కు అందింది 20 శాతమేనని… మిగిలిన 80 శాతం సొమ్ము రఘువీరారెడ్డి లాంటి వారే దోచుకున్నారని ఆరోపించారు. వీరు తిన్న 80 శాతానికి […]

రఘువీరా తన్నులు తింటావ్‌, జగన్‌కు ముట్టింది 20శాతమే
X

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిధి మించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘువీరారెడ్డి పద్దతి మార్చుకోకుంటే బట్టలూడదీసి కొడుతానంటూ వ్యాఖ్యనించారు.

రాజశేఖర్ రెడ్డి శవం పక్కన ఉండగానే జగన్‌కు లేనిపోనివి చెప్పి ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది రఘువీరారెడ్డేనని విమర్శించారు. అప్పట్లో సంపాదించిన దాంట్లో పిల్లాడైన జగన్‌కు అందింది 20 శాతమేనని… మిగిలిన 80 శాతం సొమ్ము రఘువీరారెడ్డి లాంటి వారే దోచుకున్నారని ఆరోపించారు. వీరు తిన్న 80 శాతానికి కూడా జగనే జైలుకు వెళ్లాడని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

రఘువీరారెడ్డి టీవీల్లో కనిపించాలనుకుంటే వేరే వారి గురించి మాట్లాడాలని సూచించారు. తన జోలికి వస్తే మాత్రం పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. రఘువీరారెడ్డి ఇప్పటికే కృష్ణాజిల్లాకు వెళ్లి ఓసారి, పలమనేరుకు వెళ్లి రెండోసారి దెబ్బలు తిన్నాడని.. ఇక మూడోసారి మిగిలింది తనచేతుల్లోనేనని హెచ్చరించారు. తాము మాత్రం అలాఇలా కొట్టమని పంచె, షర్ట్, ప్యాంట్‌ ఊడదీసి కొడుతామని జేసీ వార్నింగ్ ఇచ్చారు.

అభివృద్ధి పనుల కోసం తాను లంచం తీసుకుంటానని జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేయడంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇలా స్పందించారు.

First Published:  25 Oct 2015 2:16 AM GMT
Next Story