రెండు కార్లు ఢీ.. నలుగురి మృతి
అనంతపురం జిల్లాలో మన్నీలా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మన్నీల వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న కారు… ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇరువైపుల నుంచి కార్లు మితిమీరిన వేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఈశ్వరరావు, గోపాల్, నాగార్జున, భాస్కర్లు అక్కడికక్కడే మృతిచెందగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. […]
అనంతపురం జిల్లాలో మన్నీలా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మన్నీల వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న కారు… ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇరువైపుల నుంచి కార్లు మితిమీరిన వేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఈశ్వరరావు, గోపాల్, నాగార్జున, భాస్కర్లు అక్కడికక్కడే మృతిచెందగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.