Telugu Global
Others

టీడీపీకి మరో షాక్, కారెక్కనున్న గుండు

తెలంగాణ టీడీపీ నుంచి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీకి దండం పెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోగా ఇప్పుడా జాబితాలో ఎంపీ కూడా చేరారు. టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండుసుధారాణి సైకిల్ దిగి కారెక్కబోతున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ను ఆమె  కలిశారు. ఈనెల 29న ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరడం వెనుక అధికార పార్టీ ఎంపీ వినోద్ మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీడీపీ నేతల […]

టీడీపీకి మరో  షాక్, కారెక్కనున్న గుండు
X

తెలంగాణ టీడీపీ నుంచి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీకి దండం పెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోగా ఇప్పుడా జాబితాలో ఎంపీ కూడా చేరారు. టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండుసుధారాణి సైకిల్ దిగి కారెక్కబోతున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ను ఆమె కలిశారు. ఈనెల 29న ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరడం వెనుక అధికార పార్టీ ఎంపీ వినోద్ మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీడీపీ నేతల ఫోన్లకు స్పందించడం లేదు.

వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన గుండు సుధారాణిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా టీడీపీని దెబ్బకొట్టవచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. సుధారాణి రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఇటీవల అమరావతి కోసం జరిగిన మన మట్టి – మననీరు కార్యక్రమంలోనూ సుధారాణి పాల్గొన్నారు. అమరావతి కోసం స్వయంగా మట్టి, నీరు కూడా సేకరించారు.

First Published:  27 Oct 2015 12:22 AM GMT
Next Story