Telugu Global
CRIME

ఎర్ర చందనం స్మగ్లర్ దారుణ హత్య

పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఎంతో కాలం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. పట్టణంలోని సుబ్బారెడ్డినగర్‌లో ఉంటున్న స్మగ్లర్ శ్రీనివాసులురెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ముందుగా ఆయన నోట్లో యాసిడ్ పోశారు. ఆ తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు […]

పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఎంతో కాలం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. పట్టణంలోని సుబ్బారెడ్డినగర్‌లో ఉంటున్న స్మగ్లర్ శ్రీనివాసులురెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ముందుగా ఆయన నోట్లో యాసిడ్ పోశారు. ఆ తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షలే ఈ హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు.

First Published:  26 Oct 2015 4:01 PM GMT
Next Story