Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ జేబు దొంగట

తొలిసారిగా సక్సెస్ అంటే ఏంటో తెలిసొచ్చింది హీరో వరుణ్ తేజకు. అన్నీ కలిసిరావడంతో కంచె సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. వరుణ్ తేజకు ఫస్ట్ టైమ్ క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ఈ ఊపును ఇలానే కొనసాగించాలనుకుంటున్నాడు వరుణ్ తేజ. అందుకే పూరి జగన్నాధ్ తో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కంచె సినిమా మేనియా కొనసాగుతున్న టైమ్ లోనే పూరీ-వరుణ్ సినిమాను మార్కెట్లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.  తాజా సమాచారం […]

వరుణ్ తేజ జేబు దొంగట
X
తొలిసారిగా సక్సెస్ అంటే ఏంటో తెలిసొచ్చింది హీరో వరుణ్ తేజకు. అన్నీ కలిసిరావడంతో కంచె సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. వరుణ్ తేజకు ఫస్ట్ టైమ్ క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ఈ ఊపును ఇలానే కొనసాగించాలనుకుంటున్నాడు వరుణ్ తేజ. అందుకే పూరి జగన్నాధ్ తో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కంచె సినిమా మేనియా కొనసాగుతున్న టైమ్ లోనే పూరీ-వరుణ్ సినిమాను మార్కెట్లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పూరి-వరుణ్ సినిమాను డిసెంబర్ 18న థియేటర్లలోకి తీసుకురావాలనకుంటున్నారు. వచ్చేనెలలో ఆడియో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు మొదట లోఫర్ అనే టైటిల్ పెట్టారు. కానీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సినిమా పేరు మార్చేశారు. మా అమ్మ సీతామహాలక్ష్మి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమాలో వరుణ్ తేజ, జేబుదొంగగా పక్కా మాస్ క్యారెక్టర్ చేశాడు. దిషా పాండే హీరోయిన్ గా నటించింది. సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలనుకుంటున్నాడు వరుణ్.
First Published:  26 Oct 2015 7:04 PM GMT
Next Story