Telugu Global
NEWS

రాజధాని వైపు పరిశ్రమల చూపు

నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రైవేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందించడంతోపాటు మాస్టర్ ప్లాన్ లో ప్రత్యేకంగా జోన్ లు ఏర్పాటు చేసి వేల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ప్రముఖ కంపెనీలు రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 30కిపైగా ప్రధాన కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకోగా, […]

రాజధాని వైపు పరిశ్రమల చూపు
X

నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రైవేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందించడంతోపాటు మాస్టర్ ప్లాన్ లో ప్రత్యేకంగా జోన్ లు ఏర్పాటు చేసి వేల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ప్రముఖ కంపెనీలు రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 30కిపైగా ప్రధాన కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకోగా, మధ్యతరహా కంపెనీలు 782 దరఖాస్తు చేసుకున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలో నూతనంగా విద్యాసంస్థలు, హోటళ్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

రాజధాని ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా నిర్మాణాలు సాగించే అవకాశాలున్నాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ సచివాలయం, రాజ్ భవన్, ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు మూడేళ్ల కాలవ్యవధిలో నిర్మించే అవకాశం ఉంది. దీనికనుగుణంగా రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా గత నెలరోజులుగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత కదలిక వచ్చింది.

రాజధాని ప్రాంతంలో భారీ ఇన్ ఫ్రా సంస్థలు, అపార్టుమెంట్లు, మల్టీస్టోరేజ్ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ వద్ద అనుమతులు తీసుకోనున్నాయి. ఇప్పటివరకు 16కుపైగా ప్రధాన కంపెనీలు శంకుస్థాపనలు పూర్తిచేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రంలో అనుమతులు తీసుకుని 782 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇవి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థలు. వీటికి ఐదు రెట్లు రుణ సౌకర్యం ప్రభుత్వం అందించింది.

ముఖ్యంగా బ్రిక్స్, పౌల్ట్రీ, టైలరింగ్, బిస్కెట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మాస్టర్ ప్లాన్ లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియ్ జోన్ లో పరిశ్రమలు నిర్మించడానికి పదుల సంఖ్యలో మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోఈలు కుదర్చుకోగా, రెండు వారాల క్రితం 12 కంపెనీలు రూ.1800 కోట్ల విలువైన ఎంవోఈలు కుదుర్చుకున్నాయి.

First Published:  28 Oct 2015 2:03 AM GMT
Next Story