Telugu Global
CRIME

విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు!

చిరునామా అడిగే నెపంతో విశాఖపట్నంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల నుంచి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. నగరంలో జరిగిన ఈ రెండు సంఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్వీపీ కాలనీలో ఇంటి ముందు పని చేసుకుంటున్న నారాయణమ్మ(40) దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగారు. ఆమె స్పందించే లోపల మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మరోవైపు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాగే చిరునామా అడుగుతున్నట్టు నటిస్తూ […]

చిరునామా అడిగే నెపంతో విశాఖపట్నంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల నుంచి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. నగరంలో జరిగిన ఈ రెండు సంఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్వీపీ కాలనీలో ఇంటి ముందు పని చేసుకుంటున్న నారాయణమ్మ(40) దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగారు. ఆమె స్పందించే లోపల మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మరోవైపు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాగే చిరునామా అడుగుతున్నట్టు నటిస్తూ మూడు తులాల గొలుసును అపరించుకు పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  28 Oct 2015 5:04 PM GMT
Next Story