Telugu Global
Cinema & Entertainment

బోర్డర్ దాటిన చెర్రీ

హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఇప్పటికే భార్యో కలిసి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. అక్కడే 15 రోజుల పాటు రిలాక్స్ అవుతాడు చరణ్. ఆ తర్వాత తిరిగి ఇండియాకొచ్చి కొత్త సినిమా పనిలో పడతాడు. ఈమధ్యంతా బ్రూస్ లీ సినిమా బిజీలో ఉన్నాడు చెర్రీ. దాదాపు 5నెలల పాటు ఎలాంటి రెస్ట్ లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత సినిమా ప్రచారంలో కూడా పాలుపంచుకున్నాడు. ఇప్పుడు బ్రూస్ […]

బోర్డర్ దాటిన చెర్రీ
X
హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఇప్పటికే భార్యో కలిసి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. అక్కడే 15 రోజుల పాటు రిలాక్స్ అవుతాడు చరణ్. ఆ తర్వాత తిరిగి ఇండియాకొచ్చి కొత్త సినిమా పనిలో పడతాడు. ఈమధ్యంతా బ్రూస్ లీ సినిమా బిజీలో ఉన్నాడు చెర్రీ. దాదాపు 5నెలల పాటు ఎలాంటి రెస్ట్ లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత సినిమా ప్రచారంలో కూడా పాలుపంచుకున్నాడు. ఇప్పుడు బ్రూస్ లీ థియేటర్లలోకి వచ్చేయడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను ఫైనలైజ్ చేస్తాడు. తమిళ్ లో హిట్టయిన తని ఒరువన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు చెర్రీ. ఈ సినిమాకు సంబంధించి సురేందర్ రెడ్డి టీంకు కొన్ని మార్పులు సూచించాడు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మార్పులపై చర్చిస్తాడు.
First Published:  29 Oct 2015 7:07 PM GMT
Next Story