Telugu Global
CRIME

బాంబు పెట్టి పోలీస్‌ను హతమార్చిన హెడ్‌

ఓ మహిళా కానిస్టేబుల్‌తో మరో కానిస్టేబుల్‌ (28)కు ఉన్న అక్రమ సంబంధాన్ని జీర్ణించుకోలేని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ (45) ఏకంగా అతన్ని కడ తేర్చాడు. అది కూడా క్రూరంగా బైక్‌లో బాంబు పెట్టి… నితీష్‌ పాటిల్‌ అనే కానిస్టేబుల్‌కు అదే స్టేషన్‌లో పని చేస్తున్న మరో మహిళా పోలీస్‌తో అక్రమ సంబంధం ఉంది. దీన్ని తెలుసుకున్న ప్రహ్లాద్‌ పాటిల్‌ అనే కానిస్టేబుల్‌ ఈర్ష్య పెంచుకున్నాడు. రాయగఢ్ రీజియన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో సంబంధం […]

ఓ మహిళా కానిస్టేబుల్‌తో మరో కానిస్టేబుల్‌ (28)కు ఉన్న అక్రమ సంబంధాన్ని జీర్ణించుకోలేని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ (45) ఏకంగా అతన్ని కడ తేర్చాడు. అది కూడా క్రూరంగా బైక్‌లో బాంబు పెట్టి… నితీష్‌ పాటిల్‌ అనే కానిస్టేబుల్‌కు అదే స్టేషన్‌లో పని చేస్తున్న మరో మహిళా పోలీస్‌తో అక్రమ సంబంధం ఉంది. దీన్ని తెలుసుకున్న ప్రహ్లాద్‌ పాటిల్‌ అనే కానిస్టేబుల్‌ ఈర్ష్య పెంచుకున్నాడు. రాయగఢ్ రీజియన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో సంబంధం విషయమై ప్రహ్లాద్, నితేష్‌ల మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నితీష్‌ను ఎలాగైనా కడతేర్చాలని భావించి అతనికున్న బైక్‌లో బాంబు పెట్టాడు. ఇది తెలియని నితీష్‌ బైక్‌ స్టార్ట్‌ చేసిన వెంటనే బాంబు పేలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో జరిగింది. దీనికి వ్యక్తిగత ద్వేషమే కారణమని, నిందితుడ్ని అరెస్ట్‌ చేసి కేసు విచారణ జరుపుతున్నామని రాయగడ్‌ ఎస్పీ మహ్మద్‌ సువేజ్‌ తెలిపారు.

First Published:  29 Oct 2015 5:03 PM GMT
Next Story