Telugu Global
CRIME

కృపామణి కేసులో తల్లితోపాటు ఇద్దరు అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రౌడీ షీటర్‌ గుడాల సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు తప్పించుకు తిరుగుతున్నారు. తనను ఏడు లక్షలకు అమ్మేసిన తల్లిదండ్రులు, సోదరుడు, తనను కొనుక్కున్న సాయి శ్రీనివాస్‌ తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడం […]

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రౌడీ షీటర్‌ గుడాల సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు తప్పించుకు తిరుగుతున్నారు. తనను ఏడు లక్షలకు అమ్మేసిన తల్లిదండ్రులు, సోదరుడు, తనను కొనుక్కున్న సాయి శ్రీనివాస్‌ తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించగా ఓ బృందానికి కృపామణి తల్లి, సోదరుడు దొరికారు.

First Published:  29 Oct 2015 5:01 PM GMT
Next Story