Telugu Global
Others

తలసాని కుమారుడు వివాహితను కిడ్నాప్ చేశారా?

పార్టీ ఫిరాయింపుతో చిక్కులు ఎదుర్కొంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మరో తలనొప్పి మొదలైంది. తలసాని కుమారుడిపై ఓ వ్యక్తి మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను తలసాని కుమారుడు సాయికిరణ్ కిడ్నాప్ చేశారంటూ అభినవ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. మారేడుపల్లికి చెందిన భువన అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు ఈ ఏడాది మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం భువన తండ్రికి ఇష్టం లేదు. అభినవ్, భువనను […]

తలసాని కుమారుడు వివాహితను కిడ్నాప్ చేశారా?
X

పార్టీ ఫిరాయింపుతో చిక్కులు ఎదుర్కొంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మరో తలనొప్పి మొదలైంది. తలసాని కుమారుడిపై ఓ వ్యక్తి మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను తలసాని కుమారుడు సాయికిరణ్ కిడ్నాప్ చేశారంటూ అభినవ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.

మారేడుపల్లికి చెందిన భువన అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు ఈ ఏడాది మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం భువన తండ్రికి ఇష్టం లేదు. అభినవ్, భువనను వీడదీయాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌ను ఆమె తండ్రి ఆశ్రయించారు. దీంతో రంగంలోకి సాయికిరణ్… తన అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని అభినవ్ చెబుతున్నారు. దాడి చేసిన అనంతరం తన భార్య భువనను బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ తన భార్య భువన … సాయికిరణ్ ఆధీనంలోనే ఉందటూ… మారేడుపల్లి పోలీసులను అభినవ్ ఆశ్రయించారు.

First Published:  30 Oct 2015 11:45 PM GMT
Next Story