Telugu Global
NEWS

బెజవాడలో విద్యార్థులపై బీజేపీ శ్రేణులు దాడి

ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. విజయవాడలోకి బీజేపీ కార్యాలయం ముందు విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు.  మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ పార్టీ కార్యాలయం ముందే మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేంత సీన్ ఉందా అంటూ తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. బూతులు తిడుతూ కాళ్లతో తన్నారు.  విద్యార్థుల గుంపును చెదరగొట్టి… ఒంటరి వాళ్లను చేసి తీవ్ర స్థాయిలో కొట్టారు.  […]

బెజవాడలో విద్యార్థులపై బీజేపీ శ్రేణులు దాడి
X

ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. విజయవాడలోకి బీజేపీ కార్యాలయం ముందు విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ పార్టీ కార్యాలయం ముందే మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేంత సీన్ ఉందా అంటూ తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. బూతులు తిడుతూ కాళ్లతో తన్నారు. విద్యార్థుల గుంపును చెదరగొట్టి… ఒంటరి వాళ్లను చేసి తీవ్ర స్థాయిలో కొట్టారు. దాదాపు అర కిలోమీటర్ పాటు కొట్టుకుంటూ విద్యార్థులను తీసుకెళ్లారు. బీజేపీ దాడిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  1 Nov 2015 9:31 AM GMT
Next Story