Telugu Global
Cinema & Entertainment

 బాహుబ‌లి అక్క‌డ కూడా స‌త్తా చాటింది

‘బాహుబలి’ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మొత్తం 50 వేల మంది ఫాలోవర్స్‌ చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ… ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. దీనికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా […]

 బాహుబ‌లి అక్క‌డ కూడా స‌త్తా చాటింది
X

‘బాహుబలి’ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మొత్తం 50 వేల మంది ఫాలోవర్స్‌ చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ… ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. దీనికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు. ఇక మొద‌టి పార్ట్ ఊహించ‌ని స‌క్సెస్ కావ‌డంతో.. రాజ‌మౌళి బాహుబ‌లి క‌న్ క్లూజిన్ ను ఫ‌స్ట్ పార్ట్ కు మించి మెప్పించే విధంగా వ‌ర్కువుట్ చేస్తున్నారు.

First Published:  2 Nov 2015 11:08 PM GMT
Next Story