Telugu Global
NEWS

అవుకు జలాశయంలోకి దూకి 8మంది ఆత్మహత్య యత్నం

కర్నూలు జిల్లా అవుకు జలాశయంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్య యత్నం చేశారు. వీరిలో ఇద్దరు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ముగ్గురిని స్థానికులు కాపాడగా మరో ముగ్గురు రుక్మిణి (45), భవేష్‌ (5) మణి ద్వీప్‌ (2)లు జలాశయంలో కొట్టుకుపోవడంతో జాడ తెలియకుండా పోయింది. వీరి కోసం మత్స్యకారులు జలాశయంలో గాలింపు జరుపుతున్నారు. ఈ కుటుంబం కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కిష్టపాడు వాసులుగా భావిస్తున్నారు. సంఘటన స్థలికి జీపులో వచ్చిన రామయ్య […]

అవుకు జలాశయంలోకి దూకి 8మంది ఆత్మహత్య యత్నం
X

కర్నూలు జిల్లా అవుకు జలాశయంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్య యత్నం చేశారు. వీరిలో ఇద్దరు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ముగ్గురిని స్థానికులు కాపాడగా మరో ముగ్గురు రుక్మిణి (45), భవేష్‌ (5) మణి ద్వీప్‌ (2)లు జలాశయంలో కొట్టుకుపోవడంతో జాడ తెలియకుండా పోయింది. వీరి కోసం మత్స్యకారులు జలాశయంలో గాలింపు జరుపుతున్నారు. ఈ కుటుంబం కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కిష్టపాడు వాసులుగా భావిస్తున్నారు. సంఘటన స్థలికి జీపులో వచ్చిన రామయ్య కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు అవుకు జలాశయంలో దూకేశారని తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందులే ఈ సామూహిక ఆత్మహత్యా ప్రయత్నాలకు కారణంగా భావిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలు వెంకటేశ్వర్లు (52), సాహితి (3)లుగా గుర్తించారు. కోవెలకుంటలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న రామయ్య కుటుంబ సభ్యులుగా వీరిని గుర్తించారు.

First Published:  3 Nov 2015 12:30 PM GMT
Next Story