Telugu Global
CRIME

కన్నబిడ్డలపై దొంగతనం నింద... కుటుంబం చిన్నాభిన్నం

పిల్లలపై వచ్చిన దొంగతనం ఆరోపణ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తండ్రిని కాటికి పంపగా నేరారోపణ ఎదుర్కొంటున్న పిల్లలు మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలంలోని పాత రెడ్యాలలో జరిగింది. యాకయ్య (35) అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ, ఒక ఆడపిల్లలున్నారు. తల్లి పిల్లల చిన్నప్పుడే చనిపోవడంతో పిల్లలకు అన్నీ యాకయ్యే అయ్యాడు. ఈనేపథ్యంలో ఒకటో తరగతి చదువుతున్న కూతురు రుతును తాను చదివిస్తానని అదే ఊరిలో […]

కన్నబిడ్డలపై దొంగతనం నింద... కుటుంబం చిన్నాభిన్నం
X

పిల్లలపై వచ్చిన దొంగతనం ఆరోపణ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తండ్రిని కాటికి పంపగా నేరారోపణ ఎదుర్కొంటున్న పిల్లలు మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలంలోని పాత రెడ్యాలలో జరిగింది. యాకయ్య (35) అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ, ఒక ఆడపిల్లలున్నారు. తల్లి పిల్లల చిన్నప్పుడే చనిపోవడంతో పిల్లలకు అన్నీ యాకయ్యే అయ్యాడు. ఈనేపథ్యంలో ఒకటో తరగతి చదువుతున్న కూతురు రుతును తాను చదివిస్తానని అదే ఊరిలో పాఠశాలలో వంటపని చేస్తున్న భద్రమ్మ అనే మహిళ తీసుకువెళ్ళింది. సాయంత్రం వేళ ఇంటి ముందు ఊడుస్తున్న రుతును అన్నలు ప్రభాకర్‌, సాయిలు ఇక్కడున్నావేంటి రా అంటూ నానమ్మ సరోజ ఇంటికి తీసుకెళ్ళారు. దీంతో కోపం పెంచుకున్న భద్రమ్మ ప్రభాకర్‌, సాయిలు తమ ఇంటి నుంచి 12 వేలు రూపాయలు పట్టుకుపోయారని పంచాయతీ పెట్టింది. ఈ విషయాన్ని నానమ్మ సరోజ తండ్రికి చెప్పింది. దీన్ని అవమానంగా భావించిన తండ్రి యాకయ్య కూలి పని నుంచి ఇంటికొస్తూ కూల్‌డ్రింక్‌, పురుగుమందు తెచ్చాడు. ఈరెండింటిని కలిపి ప్రభాకర్‌, సాయిలకు పట్టించి తాను కూడా తాగేశాడు. దీంతో యాకయ్య మరణించగా, పిల్లలిద్దరూ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందే తల్లి లేకుండా పోయిన పిల్లలకు ఇపుడు తండ్రి కూడా లేకుండా పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  2 Nov 2015 5:03 PM GMT
Next Story