ముగ్గురు మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతున్న సమయంలో ఎదురైన మావోలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరపగా దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా దళాలు ప్రతి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల స్థావరం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బీజాపూర్ జిల్లా తోయనార్ అటవీప్రాంతంలో జరిపిన కూంబింగ్లో పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టులను అదుపులోకి […]
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతున్న సమయంలో ఎదురైన మావోలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరపగా దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా దళాలు ప్రతి కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల స్థావరం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బీజాపూర్ జిల్లా తోయనార్ అటవీప్రాంతంలో జరిపిన కూంబింగ్లో పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.