Telugu Global
NEWS

రాజయ్య కుటుంబానికి 14 రోజుల రిమాండ్‌

మాజీ ఎంపీ రాజయ్య కుటుంబసభ్యులకు న్యాయమూర్తి అజేష్‌కుమార్ 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకుముందు వరంగల్‌లోని మామునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న రాజయ్యను, ఆయన భార్య మాధవిని, కుమారుడు అనిల్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం సరిగానే ఉందని నిర్దారించుకున్న తర్వాత ఈ ముగ్గురిని న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. పోలీసులు వీరిపై 498ఏ, 306, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించిన అనంతరం వారిని […]

రాజయ్య కుటుంబానికి 14 రోజుల రిమాండ్‌
X

మాజీ ఎంపీ రాజయ్య కుటుంబసభ్యులకు న్యాయమూర్తి అజేష్‌కుమార్ 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకుముందు వరంగల్‌లోని మామునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న రాజయ్యను, ఆయన భార్య మాధవిని, కుమారుడు అనిల్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం సరిగానే ఉందని నిర్దారించుకున్న తర్వాత ఈ ముగ్గురిని న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. పోలీసులు వీరిపై 498ఏ, 306, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించిన అనంతరం వారిని వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

First Published:  5 Nov 2015 12:57 PM GMT
Next Story