Telugu Global
Others

కోట్ల విలువైన భూమి రాధాకృష్ణకు అప్పగింత !

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక‌ృష్ణకు కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎకరం ఐదు కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.80 లక్షలకే అప్పగించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.  తిరుపతిలో 1. 5 ఎకరాల భూమిని ఏబీఎన్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం కూడా చంద్రబాబు ఆమోదింపచేశారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా సదరు టీవీ […]

కోట్ల విలువైన భూమి రాధాకృష్ణకు అప్పగింత !
X

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక‌ృష్ణకు కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎకరం ఐదు కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.80 లక్షలకే అప్పగించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

తిరుపతిలో 1. 5 ఎకరాల భూమిని ఏబీఎన్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం కూడా చంద్రబాబు ఆమోదింపచేశారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా సదరు టీవీ చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను, మైసూరారెడ్డి కలిసి ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీస్తున్నామంటూ దిగజారుడు కథనాలు ప్రసారం చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకే సదరు చానల్ ఈ స్థాయికి దిగజారిందని విమర్శించారు.

అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల స్థలాలు కోరితే … ప్రభుత్వ భూములేమైనా ఉద్యోగుల జాగీరా అంటూ చానల్‌లో విమర్శించిన రాధాక‌ృష్ణ మరి ఇప్పుడెలా ప్రభుత్వ భూములు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.

First Published:  4 Nov 2015 9:10 PM GMT
Next Story