Telugu Global
NEWS

ఏపీకి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెంటాడుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. అనుమతులు లేకుండానే కార్యక్రమం నిర్వహించడం ద్వారా గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ధిక్కరించిందంటూ జర్నలిస్ట్ శ్రీమన్నారాయణ మరోసారి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. శ్రీమన్నారాయణ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్ డీఏకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోగా.. నోటీసులకు సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ […]

ఏపీకి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
X

రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెంటాడుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. అనుమతులు లేకుండానే కార్యక్రమం నిర్వహించడం ద్వారా గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ధిక్కరించిందంటూ జర్నలిస్ట్ శ్రీమన్నారాయణ మరోసారి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. శ్రీమన్నారాయణ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్ డీఏకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోగా.. నోటీసులకు సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.

First Published:  5 Nov 2015 5:18 AM GMT
Next Story