Telugu Global
Others

కడియంపైకి చెప్పు విసిరిన రైతు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శాయంపేటకు వచ్చిన కడియంపైకి ఓ రైతు చెప్పు విసిరారు. దీంతో కలకలం రేగింది. రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందంటూ కడియం శ్రీహరి చెబుతున్న సమయంలోనే రైతు సాయిలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదంటూ నినాదాలు చేశారు. కరెంట్ రావడం లేదు, మద్దతు ధర దక్కడం లేదంటూ నినదించారు. ఒక్కసారిగా తన చెప్పు తీసి […]

కడియంపైకి చెప్పు విసిరిన రైతు
X

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శాయంపేటకు వచ్చిన కడియంపైకి ఓ రైతు చెప్పు విసిరారు. దీంతో కలకలం రేగింది. రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందంటూ కడియం శ్రీహరి చెబుతున్న సమయంలోనే రైతు సాయిలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదంటూ నినాదాలు చేశారు. కరెంట్ రావడం లేదు, మద్దతు ధర దక్కడం లేదంటూ నినదించారు. ఒక్కసారిగా తన చెప్పు తీసి మంత్రిపైకి విసిరారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే రైతు విసిరిన చెప్పు మంత్రిని తాకలేదు. వెంటనే పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకున్నారు. కడియం వెంట మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

First Published:  6 Nov 2015 7:43 AM GMT
Next Story