Telugu Global
CRIME

చిరు వివాదం పెద్దదై... ఒకరి హత్య, ఓ ఇల్లు దగ్ధం

ఓ హత్య గ్రామాన్నే కకావికలం చేసింది. ఒక్కోసారి చిన్నచిన్న గొడవలనుకున్నవే పెద్దగా మారి పరిస్థితులను మార్చి వేస్తాయి. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇందుకు ఉదాహరణే… పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారంపేట-హరిజన పేటలో జరిగిన ఓ సంఘటన. ఈ ప్రాంతానికి చెందిన శేఖర్‌, చిన్నారావు అనే వ్యక్తులు సోదరులు. వీరిద్దరూ పేరా సురేష్‌ అనే వ్యక్తితో రెండు రోజుల క్రితం గొడవ పడ్డారు. తన సోదరుడు సురేష్‌తో గొడవ పడిన శేఖర్‌ను, చిన్నారావును నిలదీసేందుకు ఆయన సోదరుడు […]

ఓ హత్య గ్రామాన్నే కకావికలం చేసింది. ఒక్కోసారి చిన్నచిన్న గొడవలనుకున్నవే పెద్దగా మారి పరిస్థితులను మార్చి వేస్తాయి. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇందుకు ఉదాహరణే… పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారంపేట-హరిజన పేటలో జరిగిన ఓ సంఘటన. ఈ ప్రాంతానికి చెందిన శేఖర్‌, చిన్నారావు అనే వ్యక్తులు సోదరులు. వీరిద్దరూ పేరా సురేష్‌ అనే వ్యక్తితో రెండు రోజుల క్రితం గొడవ పడ్డారు. తన సోదరుడు సురేష్‌తో గొడవ పడిన శేఖర్‌ను, చిన్నారావును నిలదీసేందుకు ఆయన సోదరుడు సంజీవరావు వారి ఇంటికి వెళ్ళి గొడవ చేశాడు. దీంతో రెచ్చిపోయిన శేఖర్‌ సోదరులు సంజీవరావుపై దాడి చేశారు. ఈ సంఘర్షణలో సంజీవరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు.
సంజీవరావు మరణం, తండ్రి నాగేశ్వరరావు అపస్మారక స్థితిలోకి పోవడంతో గ్రామస్థులు తట్టుకోలేక పోయారు. మహిళలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. చిన్నారావు ఇంటిపై దాడికి దిగారు. ఆగ్రహంతో ఉన్న వారు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఏకంగా వారు చిన్నారావు ఇంటికి నిప్పు పెట్టారు. పూర్తిగా తగులబెట్టారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకునే సరికి మంటలకు ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  8 Nov 2015 3:03 PM GMT
Next Story