Telugu Global
National

ఇక్కడ గాడ్సే " అక్కడ గాంధీ?

ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ గాంధీని పొగుడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్లమెంట్ స్వ్కేర్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఏచూరి తప్పుపట్టారు. లండన్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం భారతీయులకు గొప్ప విజయం.. ఇంగ్లాండ్‌ ప్రజలు మహాత్ముణ్ణి బాగా అర్థం చేసుకుంటారన్న మోడీ… భారత్ లో చేస్తోంది ఏంటని ఏచూరీ ప్రశ్నించారు. బ్రిటన్ […]

ఇక్కడ గాడ్సే  అక్కడ గాంధీ?
X

ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ గాంధీని పొగుడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్లమెంట్ స్వ్కేర్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఏచూరి తప్పుపట్టారు. లండన్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం భారతీయులకు గొప్ప విజయం.. ఇంగ్లాండ్‌ ప్రజలు మహాత్ముణ్ణి బాగా అర్థం చేసుకుంటారన్న మోడీ… భారత్ లో చేస్తోంది ఏంటని ఏచూరీ ప్రశ్నించారు.
బ్రిటన్ లో గాంధీ గొప్పతనాన్ని పొగిడిన మోడీ మన దేశంలో మాత్రం గాడ్సే గొప్ప దేశ భక్తుడని, మహత్తర కార్యం చేశారని కమలనాథులు కీర్తిస్తున్న విషయాన్ని ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు. ఇది మోడీ, బిజెపి అసలైన రూపమని ఏచూరి విమర్శించారు. మోడీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని, మత ఘర్షణలను పెంచి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడాన్ని ఏచూరి తప్పుపట్టారు. దేశంలో ధరలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ.. విదేశీ పెట్టుబడి దారులకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మా దేశాన్ని దోచుకోండి అంటూ ఆహ్వానిస్తున్నారని ఏచూరి ఆరోపించారు.

First Published:  14 Nov 2015 2:05 AM GMT
Next Story