Telugu Global
Others

సమంత చీర కడితే ఆశ్చర్యం ఏముంది?: వెంకయ్య

కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగిన స్వచ్చభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  హీరోయిన్‌ సమంత గురించి ఒక మాట చెప్పారు.  ”సమంత చీర కడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన సమంత అప్పుడప్పుడు ఆ డ్రస్సులు… ఈ డ్రస్సులు కూడా వేస్తుంటుంది. కానీ బ్రిటన్‌ ప్రధాని డెవిడ్ కామెరూన్ భార్య సమంత కామెరూన్  చీర కట్టింది. అది మన భారతదేశ  గొప్పదానికి నిదర్శనం” అని వెంకయ్య చెప్పారు. గుజరాత్‌లో మోదీ ఎప్పుడూ […]

సమంత చీర కడితే ఆశ్చర్యం ఏముంది?: వెంకయ్య
X

కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగిన స్వచ్చభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్‌ సమంత గురించి ఒక మాట చెప్పారు. ”సమంత చీర కడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన సమంత అప్పుడప్పుడు ఆ డ్రస్సులు… ఈ డ్రస్సులు కూడా వేస్తుంటుంది. కానీ బ్రిటన్‌ ప్రధాని డెవిడ్ కామెరూన్ భార్య సమంత కామెరూన్ చీర కట్టింది. అది మన భారతదేశ గొప్పదానికి నిదర్శనం” అని వెంకయ్య చెప్పారు.

గుజరాత్‌లో మోదీ ఎప్పుడూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని అయినా వరుసగా గెలిచారని చెప్పారు. అదే మన రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీలు కూడా ఓడిపోయాయన్నారు. దేశంలో రాజకీయ నాయకుల హామీలు చూస్తుంటే ఎటు పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. కొద్ది రోజులు పోతే గడ్డం గీస్తాం… పళ్లు తోముతాం… మీ పిల్లలకు అది కడుగుతాం అనే స్థాయికి నేతలు దిగజారుతారేమోనని వెంకయ్య అన్నారు.

అమెరికాలో టాప్‌ 10 డాక్టర్లలో సగం మంది భారతీయులేనని చెప్పారు. ఆ సగం మందిలో కృష్ణాజిల్లా డాక్టర్లే ఎక్కువగా ఉంటారని చెప్పారు. మహానాయకుడు ఎన్టీఆర్‌ విగ్రహాలను చూస్తే సూర్తి, పట్టుదల, తెలుగుతేజం కనిపిస్తుందన్నారు. అలాంటి గొప్ప వాళ్ల విగ్రహాల గురించి పిల్లలకు తెలియజేయాలన్నారు. అన్ని పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏమీ లేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు భారీగా ఉన్నాయని అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి అధికంగా ఉందని వెంకయ్య అన్నారు.

First Published:  15 Nov 2015 12:27 AM GMT
Next Story