చిత్తూరు మేయర్ అనురాధ దారుణహత్య
చిత్తూరు మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్తపై దుండగులు కత్తులతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. కాల్పుల్లో అనురాధ చనిపోగా.. ఆమె భర్త మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండుగులు పారిపోయారు. మేయర్ చాంబర్లోకి చొరబడి పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపారు. అనురాధ కంటిలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ చాతీకి తాకింది. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష […]
చిత్తూరు మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్తపై దుండగులు కత్తులతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. కాల్పుల్లో అనురాధ చనిపోగా.. ఆమె భర్త మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండుగులు పారిపోయారు. మేయర్ చాంబర్లోకి చొరబడి పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపారు. అనురాధ కంటిలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ చాతీకి తాకింది. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం ఏడుగురు దుండగులు దాడిలో పాల్గొన్నారు. అనురాధ ఘటనాస్థలిలోనే చనిపోయారు. అనురాధ టీడీపీకి చెందిన నాయకురాలు. మేయర్ హత్యతో చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read: అనురాధ హత్య జరిగిన తీరు ఇది