సెల్ఫీ వీడియో... భార్య మోసం... కరాటే మాస్టర్ సూసైడ్
భార్య మోసం చేసిదంటూ పురుగుల మందు తాగిన నాగేశ్వరరావు అనే కరాటే మాస్టర్ చనిపోయాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన భార్య వరలక్ష్మి మరో కానిస్టేబుల్తో సన్నిహితంగా ఉంటోందని అందుకే జీవితం మీద విరక్తి కలిగి తాను చనిపోతున్నానంటూ నాగేశ్వరరావు ఒక సెల్పీ వీడియోను కూడా రికార్డు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగేశ్వర్రావు.. బాపట్లకు చెందిన వరలక్ష్మి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. సికింద్రాబాద్లోని బన్సిలాట్పేట్లో కాపురం పెట్టారు. నాగేశ్వర్రావు కరాటే మాస్టారుగా పనిచేస్తుండగా.. వరలక్ష్మి సీఆర్ […]
భార్య మోసం చేసిదంటూ పురుగుల మందు తాగిన నాగేశ్వరరావు అనే కరాటే మాస్టర్ చనిపోయాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన భార్య వరలక్ష్మి మరో కానిస్టేబుల్తో సన్నిహితంగా ఉంటోందని అందుకే జీవితం మీద విరక్తి కలిగి తాను చనిపోతున్నానంటూ నాగేశ్వరరావు ఒక సెల్పీ వీడియోను కూడా రికార్డు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగేశ్వర్రావు.. బాపట్లకు చెందిన వరలక్ష్మి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. సికింద్రాబాద్లోని బన్సిలాట్పేట్లో కాపురం పెట్టారు. నాగేశ్వర్రావు కరాటే మాస్టారుగా పనిచేస్తుండగా.. వరలక్ష్మి సీఆర్ హెడ్క్వార్టర్స్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. మొదట్లో కాపురం బాగానే నడిచింది. అయితే కొద్దికాలంగా సంతోష్ అనే కానిస్టేబుల్తో వరలక్ష్మి సన్నిహితంగా ఉంటోందని నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. వరలక్ష్మీ- సంతోష్ పనిచేసేది కూడా ఒకే చోట కావడంతో నాగేశ్వరరావు మరింత కుంగిపోయాడు.
ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి వరలక్ష్మి, నాగేశ్వరరావుకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. చివరకు హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని భార్యను కోరాడు. అందుకు వరలక్ష్మి అంగీకరించలేదు. విడాకులు ఇవ్వాలనికోరింది. దీంతో మనోవేధనకు గురైన నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. భార్య వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని వాంగ్మూలం ఇచ్చాడు. అయితే… వరలక్ష్మి మాత్రం నాగేశ్వరరావుకు భారీగా అప్పులున్నాయని వాటి కోసం డబ్బు ఇవ్వాలంటూ వేధించేవాడని చెబుతోంది. డబ్బు ఇవ్వనందుకు లేనిపోని నిందలు వేశారని వాపోతోంది.