Telugu Global
Others

చంద్రబాబు ఫోటోకు రంగు పూసింది ఎవరు..?

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో చంద్రబాబు ఫోటోకు కొందరు గుర్తు తెలియవని వ్యక్తులకు మరకలు పూయడం కలకలం రేపింది. మీడియా పాయింట్ వద్ద ఉన్నచంద్రబాబు ఫోటోలోని పంటికి నల్ల రంగు పూశారు. ఈ విషయాన్ని సీఎం సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ పని చేసింది ఎవరన్న దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. Click to Read: నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా…! మీడియా పాయింట్ పరిసరాల్లో ఎక్కువగా మీడియా ప్రతినిధులు తిరుగుతుంటారని కాబట్టి వారే రంగు […]

చంద్రబాబు ఫోటోకు రంగు పూసింది ఎవరు..?
X

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో చంద్రబాబు ఫోటోకు కొందరు గుర్తు తెలియవని వ్యక్తులకు మరకలు పూయడం కలకలం రేపింది. మీడియా పాయింట్ వద్ద ఉన్నచంద్రబాబు ఫోటోలోని పంటికి నల్ల రంగు పూశారు. ఈ విషయాన్ని సీఎం సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ పని చేసింది ఎవరన్న దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Click to Read: నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా…!

మీడియా పాయింట్ పరిసరాల్లో ఎక్కువగా మీడియా ప్రతినిధులు తిరుగుతుంటారని కాబట్టి వారే రంగు పూసి ఉంటారని అనుమానిస్తున్నారు. లేక అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైనా ఇలా చేశారా అన్న కోణంలోనూ భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. తమకు తెలిసిన మీడియా ప్రతినిధులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇంటెల్సిజెన్స్ వాళ్లు ఆరా తీస్తున్నారని సమాచారం.

చంద్రబాబుకు ఫోటోకు రంగు పూయడం చూడ్డానికి చిన్న విషయంగానే కనిపించినా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సీఎం భద్రతా సిబ్బంది భావిస్తోంది. నల్లరంగు పూసిన ఫోటోను సమాచార శాఖ సిబ్బంది తొలగించారు. ఈ ఘటన నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Click to Read: రేవంత్‌కు సీఎం అభ్యర్థిగా ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి

First Published:  27 Nov 2015 1:25 AM GMT
Next Story