Telugu Global
Others

అత్తమీద కోపం దుత్త మీద! " అధికారుల మెడపై కత్తి!

ఏపీ ప్రభుత్వం మీడియాపై ఆంక్షల అస్త్రం ప్రయోగించింది. అయితే నేరుగా మీడియాపై ప్రయోగించకుండా అధికారుల మెడపై కత్తి వేలాడదీసింది. ఇకపై ఏ అధికారి అయినా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మీడియాకు ఇస్తే చర్యలు తప్పవంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు నిత్యం పత్రికల్లో పతాకశీర్శికల్లో వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. మీడియాకు అధికారులెవ్వరూ ఎలాంటి సమాచారం ఇవ్వొద్దంటూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఆదేశాల […]

అత్తమీద కోపం దుత్త మీద!  అధికారుల మెడపై కత్తి!
X

ఏపీ ప్రభుత్వం మీడియాపై ఆంక్షల అస్త్రం ప్రయోగించింది. అయితే నేరుగా మీడియాపై ప్రయోగించకుండా అధికారుల మెడపై కత్తి వేలాడదీసింది. ఇకపై ఏ అధికారి అయినా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మీడియాకు ఇస్తే చర్యలు తప్పవంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు నిత్యం పత్రికల్లో పతాకశీర్శికల్లో వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మీడియాకు అధికారులెవ్వరూ ఎలాంటి సమాచారం ఇవ్వొద్దంటూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఆదేశాల మేరకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మునివెంకటప్ప ఈ సర్క్యులర్ జారీ చేశారు. ప్రచారం కోసం మీడియాను బాగా వాడుకునే చంద్రబాబు ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మీడియాకు ఎటువంటి సమాచారం ఇచ్చినా, డాక్యుమెంట్లను అందజేసినా సదరు అధికారులపై శాఖ పరమైన చర్యలు తప్పవని సర్క్యులర్‌లో హెచ్చరించింది ప్రభుత్వం. ఈ సర్క్యులర్‌లో ఇచ్చిన వార్నింగ్‌ చూసి ఉన్నతాధికారులే విస్మయం చెందుతున్నారు.

First Published:  3 Dec 2015 3:07 AM GMT
Next Story