Telugu Global
NEWS

ఇప్పుడు వైసీపీలో చేరడం ఏంటో?

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్‌తో పాటు వైసీపీ కూడా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ నుంచే నేతలు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వరంగల్‌ జిల్లాకే చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య వైసీపీలో చేరడం ఆసక్తికరంగా ఉంది.  జగన్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి కనీసం ఆ పార్టీలో ఉన్నా అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది. అలాంటిది సాంబయ్య వైసీపీలో చేరడానికి కారణం […]

ఇప్పుడు వైసీపీలో చేరడం ఏంటో?
X

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్‌తో పాటు వైసీపీ కూడా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ నుంచే నేతలు బయటకు వచ్చేస్తున్నారు. కానీ వరంగల్‌ జిల్లాకే చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య వైసీపీలో చేరడం ఆసక్తికరంగా ఉంది. జగన్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి కనీసం ఆ పార్టీలో ఉన్నా అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది. అలాంటిది సాంబయ్య వైసీపీలో చేరడానికి కారణం చాలా మందికి అంతుచిక్కడం లేదని నేతలంటున్నారు. సాంబయ్య మాత్రం ఒకప్పుడు బడుగుల పార్టీ అయిన టీడీపీ ఇప్పుడు హైజాక్ అయిందని చెబుతున్నారు. తెలంగాణ టీడీపీలో కొంతమంది నాయకులు టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని… తెలంగాణలో టీడీపీ అన్నదే లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తారని సాంబయ్య అంటున్నారు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దొమ్మాటి సాంబయ్య వైసీపీలో చేరడం మునుముందు ఆయనకు ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి.

First Published:  5 Dec 2015 7:17 AM GMT
Next Story