Telugu Global
NEWS

వరదలకూ బాబే కారణమంటే ఎలా స్వామి?

తొలి నుంచీ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన ముహూర్తం సరిగా లేదని చెబుతూ వస్తున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర మరోసారి స్పందించారు. తమిళనాడు, నెల్లూరులో వరదలపై స్పందిస్తూ మోదీ, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన ముహూర్తం సరిగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు. సరైన ముహూర్తంలో ఇద్దరూ ప్రమాణస్వీకారం చేసి ఉంటే ఇలా పదేపదే రాష్ట్రంలో, దేశంలో విపత్తులు వచ్చేవి కాదన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఎన్నో విపత్తులను చవిచూసిందన్నారు. అమరావతి […]

వరదలకూ బాబే కారణమంటే ఎలా స్వామి?
X

తొలి నుంచీ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన ముహూర్తం సరిగా లేదని చెబుతూ వస్తున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర మరోసారి స్పందించారు. తమిళనాడు, నెల్లూరులో వరదలపై స్పందిస్తూ మోదీ, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన ముహూర్తం సరిగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు. సరైన ముహూర్తంలో ఇద్దరూ ప్రమాణస్వీకారం చేసి ఉంటే ఇలా పదేపదే రాష్ట్రంలో, దేశంలో విపత్తులు వచ్చేవి కాదన్నారు.

మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఎన్నో విపత్తులను చవిచూసిందన్నారు. అమరావతి శంకుస్థాపన ముహూర్తం కూడా సరిగా లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగవంతుడిని నమ్ముకుని శాంతియాగం చేయాలని స్వరూపనందేంద్ర సూచించారు. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం దారుణమన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

First Published:  5 Dec 2015 8:23 AM GMT
Next Story