Telugu Global
NEWS

అభిమాన వరద- మధ్యలోనే వెళ్లిపోయిన స్టార్స్

తమిళనాడు వదర బాధితుల కోసం విరళాలు సేరించిందుకు ప్రయత్నించిన సినీస్టార్స్‌కు అభిమానుల మితిమీరిన అభిమానం ఇబ్బంది పెట్టింది. చివరకు స్వల్ప తొక్కిసలాట జరిగి కార్యక్రమాన్ని మధ్యలో నిలిపివేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం హైదరాబాద్ కూకల్‌పల్లిలోని సుజనా మాల్‌లో విరాళాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రానా, కాజల్, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి వంటి వారు హాజరయ్యారు. అయితే వీరంతా సభావేదిక వద్దకు వస్తుండగానే అభిమానులు ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు. నటులను సెల్‌ఫోన్‌తో చిత్రికరించేందుకు […]

అభిమాన వరద- మధ్యలోనే వెళ్లిపోయిన స్టార్స్
X

తమిళనాడు వదర బాధితుల కోసం విరళాలు సేరించిందుకు ప్రయత్నించిన సినీస్టార్స్‌కు అభిమానుల మితిమీరిన అభిమానం ఇబ్బంది పెట్టింది. చివరకు స్వల్ప తొక్కిసలాట జరిగి కార్యక్రమాన్ని మధ్యలో నిలిపివేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం హైదరాబాద్ కూకల్‌పల్లిలోని సుజనా మాల్‌లో విరాళాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రానా, కాజల్, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి వంటి వారు హాజరయ్యారు. అయితే వీరంతా సభావేదిక వద్దకు వస్తుండగానే అభిమానులు ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు.

నటులను సెల్‌ఫోన్‌తో చిత్రికరించేందుకు ఎగబడ్డారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. పలువురు అభిమానులు కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మాల్‌ సిబ్బంది, బౌన్సర్లు … నటులను పక్కకు తీసుకెళ్లారు. మాల్‌లోనే కాసేపు రిలాక్స్ అయిన తర్వాత స్టార్లు అటు నుంచి వెళ్లి పోయారు. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సినీ స్టార్లు కోరారు.

First Published:  6 Dec 2015 6:35 PM GMT
Next Story