Telugu Global
Others

ఈసారి "జన చైతన్యం"పై పేల్చిన జేసీ

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అధికారపక్షంలోనే ఓ మంచి విమర్శకుడిగా తయారయ్యారు. ప్రభుత్వంపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పే ప్రభాకర్ రెడ్డి… టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్యయాత్రలపైనా కామెంట్స్ చేశారు. జనచైతన్య యాత్రకు జనం నుంచి స్పందన లేదని తేల్చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. పంటలకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపరిహారం ఇలా ఏదీ అందలేదని అందుకే జనచైతన్యయాత్రకు స్పందన లేకుండా పోయిందని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా అమలు […]

ఈసారి జన చైతన్యంపై పేల్చిన జేసీ
X

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అధికారపక్షంలోనే ఓ మంచి విమర్శకుడిగా తయారయ్యారు. ప్రభుత్వంపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పే ప్రభాకర్ రెడ్డి… టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్యయాత్రలపైనా కామెంట్స్ చేశారు. జనచైతన్య యాత్రకు జనం నుంచి స్పందన లేదని తేల్చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. పంటలకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపరిహారం ఇలా ఏదీ అందలేదని అందుకే జనచైతన్యయాత్రకు స్పందన లేకుండా పోయిందని విమర్శించారు.

ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా అమలు కాలేదని కుండ బద్ధలు కొట్టారు. తాను టీడీపీ ఎమ్మెల్యేనే అయినా వాస్తవాలు మాట్లాడకతప్పదని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోమంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి వేదికపైనే ఉన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగిన జనచైతన్యయాత్రలో ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  9 Dec 2015 9:46 PM GMT
Next Story