Telugu Global
NEWS

సెక్స్‌ రాకెట్‌ కీచక పర్వం- సంవత్సరీకం నాడు అత్యాచారాలే!

బెజవాడలో వెలుగుచూసిన కాల్ మనీ-సెక్స్ రాకెట్‌ అరాచకాలు రాక్షసత్వాన్ని తలదన్నె స్థాయిలో సాగినట్టు వెలుగులోకి వస్తోంది.  కాల్ మనీ బ్యాచ్‌ అరెస్ట్ అనంతరం చాలా మంది ధైర్యంచేసి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది.  కేసులో ప్రధాన నిందితుడైన యలమంచలి రాము సోదరుడి సంవత్సరీక కార్యాక్రమం కాకులపాడులో నవంబర్ 26న జరిగింది.  ఆ ముందు రోజు రాత్రి కాల్ మనీ ముఠా సభ్యులు, పలువురు ప్రముఖులు స్థానిక రైస్ మిల్లులో కలుసుకున్నారని తెలుస్తోంది. ముఠా […]

సెక్స్‌ రాకెట్‌ కీచక పర్వం- సంవత్సరీకం నాడు అత్యాచారాలే!
X

బెజవాడలో వెలుగుచూసిన కాల్ మనీ-సెక్స్ రాకెట్‌ అరాచకాలు రాక్షసత్వాన్ని తలదన్నె స్థాయిలో సాగినట్టు వెలుగులోకి వస్తోంది. కాల్ మనీ బ్యాచ్‌ అరెస్ట్ అనంతరం చాలా మంది ధైర్యంచేసి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడైన యలమంచలి రాము సోదరుడి సంవత్సరీక కార్యాక్రమం కాకులపాడులో నవంబర్ 26న జరిగింది. ఆ ముందు రోజు రాత్రి కాల్ మనీ ముఠా సభ్యులు, పలువురు ప్రముఖులు స్థానిక రైస్ మిల్లులో కలుసుకున్నారని తెలుస్తోంది. ముఠా దగ్గర అప్పులు చేసి తిరిగి చెల్లించలేక లొంగిపోయిన కొందరు మహిళలను ఆ రాత్రి అక్కడికి పిలిపించుకున్నట్టు చెబుతున్నారు.

ఆ రాత్రంతా సదరు మహిళల జీవితాలతో ముఠా సభ్యులు, ముఖ్యులు ఆడుకున్నారని సమాచారం. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సదరు మహిళలు మౌనంగా అవమానాన్ని దిగమింగుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ వికృత వినోదంలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారని చెబుతున్నారు. అందువల్లే రైస్ మిల్‌లో జరుగుతున్న ఘోరం గురించి తెలిసినా పోలీసులు అటు వైపు వెళ్లే సాహసం చేయలేకపోయారు. కాల్ మనీ వ్యాపారం కోసం పటమటలో ముఠా ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. అయితే సొంత అవసరం ఉందని ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై దాడి చేశారు. యజమాని శేషగిరిరావు తలకు కుట్లు కూడా పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా శేషగిరిరావే చెబుతున్నారు..

Click to Read నానిపై టీడీపీ మానసిక యుద్ధం!

First Published:  12 Dec 2015 9:06 PM GMT
Next Story