టీఆర్ఎస్ పేరు మారుస్తాం... భీమవరం నుంచి పోటీ చేస్తా...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లు ఆకట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఒక సామాజికవర్గానికి సంబంధించిన ఓటర్లు ఆకట్టుకునేందుకు సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు పిలిస్తే తన తండ్రి వెళ్లారని గుర్తు చేశారు. అక్కడ కేసీఆర్ ప్రసంగానికి చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈవిషయాన్ని తనకు ఏపీ మంత్రి ఒకరు ఫోన్ చేసి చెప్పగా.. త్వరలోనే టీఆర్ఎస్ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి ఏపీలోనూ పోటీ […]
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లు ఆకట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఒక సామాజికవర్గానికి సంబంధించిన ఓటర్లు ఆకట్టుకునేందుకు సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు పిలిస్తే తన తండ్రి వెళ్లారని గుర్తు చేశారు. అక్కడ కేసీఆర్ ప్రసంగానికి చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈవిషయాన్ని తనకు ఏపీ మంత్రి ఒకరు ఫోన్ చేసి చెప్పగా.. త్వరలోనే టీఆర్ఎస్ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి ఏపీలోనూ పోటీ చేస్తామని సదరు మంత్రితో చెప్పానని కేటీఆర్ అన్నారు. ఏపీలో పోటీ చేయాల్సి వస్తే తాను భీమవరం నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడుతానన్నారు. అక్కడ కోడిపందాలను లీగలైజ్ చేస్తామంటే చాలు తన గెలుపు ఖాయమని సరదాగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రసంగానికి సభికులు నుంచి నవ్వులు విరబూశాయి.