Telugu Global
NEWS

ఎంత కష్టమొచ్చింది " మోత్కుపల్లి కంట కన్నీరు

టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టుకున్నారు. పార్టీ నాయకుల సమక్షంలోనే కన్నీరు పెట్టుకుని ఆవేదన చెందారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లోనే ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా ఆలేరు ప్రజలతో ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న మోత్కుపల్లి … ముందుగా పార్టీ కార్యాలయంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి టీటీడీపీ నేతలకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఎన్టీఆర్‌ను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. తనకు రాజకీయాలు చేయడం […]

ఎంత కష్టమొచ్చింది  మోత్కుపల్లి కంట కన్నీరు
X

టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టుకున్నారు. పార్టీ నాయకుల సమక్షంలోనే కన్నీరు పెట్టుకుని ఆవేదన చెందారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లోనే ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా ఆలేరు ప్రజలతో ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న మోత్కుపల్లి … ముందుగా పార్టీ కార్యాలయంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి టీటీడీపీ నేతలకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఎన్టీఆర్‌ను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. తనకు రాజకీయాలు చేయడం చేతగాదన్నారు. తాను బలవంతుడిని కాదని, పైరవీకారుడినీ కాదని చెప్పారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసమే ఆత్మీయ కలయిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని భావోద్వేగంతో అన్నారు మోత్కుపల్లి.

First Published:  14 Jan 2016 2:32 AM GMT
Next Story