Telugu Global
Others

ఉత్తమ్‌పై గ్రేటర్‌ తిరుగుబాటు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. గ్రేటర్‌ పరిధిలోని మాజీలు ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో తాము సూచించిన వారికి కాకుండా ఇతరులకు ఎలా సీట్లు ఇస్తారని మాజీలు నిలదీస్తున్నారు. సుధీర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీధర్, భిక్షపతి, శ్రీశైలం గౌడ్‌లు ఉత్తమ్‌పై ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సూచించిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీరా తమను అవమానించారని వారు రగిలిపోతున్నారు. పార్టీని […]

ఉత్తమ్‌పై గ్రేటర్‌ తిరుగుబాటు
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. గ్రేటర్‌ పరిధిలోని మాజీలు ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో తాము సూచించిన వారికి కాకుండా ఇతరులకు ఎలా సీట్లు ఇస్తారని మాజీలు నిలదీస్తున్నారు. సుధీర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీధర్, భిక్షపతి, శ్రీశైలం గౌడ్‌లు ఉత్తమ్‌పై ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సూచించిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీరా తమను అవమానించారని వారు రగిలిపోతున్నారు. పార్టీని వీడేందుకైనా సిద్ధమంటున్నారు. నేరుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి హెచ్చరికలు జారీ చేశారు. సుధీర్‌ రెడ్డి ఎల్బీనగర్‌ పరిధిలో ఐదుగురికి టికెట్లు సిఫార్సు చేయగా ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో సుధీర్‌ రెడ్డి రగిలిపోతున్నారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి వర్గం వాదన మరోలా ఉంది. కొందరు టికెట్ ఇచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని అందుకే వారికి టికెట్లు ఇవ్వ లేదని చెబుతోంది.

First Published:  17 Jan 2016 1:40 AM GMT
Next Story