Telugu Global
NEWS

కరిష్మా వ్యక్తిత్వంపై భర్త ఆరోపణలు

మొన్నటి బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ కరిష్మా కపూర్ కాపురం కోర్టుకెక్కింది. ఆమె భర్త సంజయ్‌కుమార్‌ ఫ్యామిలీ కోర్టులో  విడాకుల పిటిషన్ వేశారు. విడాకులు కోరుతూ పలు తీవ్ర ఆరోపణలు చేశాడు ఆమె భర్త సంజయ్ . డబ్బు కోసమే కరిష్మా తనను పెళ్లి చేసుకుందని వివాహమైన 12 ఏళ్ల తర్వాత చెబుతున్నారు. అంతే కాదు పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్‌తో ఉన్న సంబంధాన్ని కూడా ప్రస్తావించాడు.  అప్పట్లో అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ తో కరిష్మా వివాహా […]

కరిష్మా వ్యక్తిత్వంపై భర్త ఆరోపణలు
X

మొన్నటి బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ కరిష్మా కపూర్ కాపురం కోర్టుకెక్కింది. ఆమె భర్త సంజయ్‌కుమార్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. విడాకులు కోరుతూ పలు తీవ్ర ఆరోపణలు చేశాడు ఆమె భర్త సంజయ్ . డబ్బు కోసమే కరిష్మా తనను పెళ్లి చేసుకుందని వివాహమైన 12 ఏళ్ల తర్వాత చెబుతున్నారు. అంతే కాదు పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్‌తో ఉన్న సంబంధాన్ని కూడా ప్రస్తావించాడు.

అప్పట్లో అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ తో కరిష్మా వివాహా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ పెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. దీంతో అనంతరం 2003లో సంజయ్‌ కపూర్‌ను కరిష్మా వివాహం చేసుకుంది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు గాను తన డబ్బును చూసే కరిష్మా పెళ్లి చేసుకుందంటున్నాడు ఢిల్లీకి చెందిన ఈ పారిశ్రామికవేత్త. భార్యగానే కాకుండా తల్లిగా, కోడలిగానూ కరిష్మా విఫలమైందని పిటిషన్‌లో విమర్శలు చేశాడు. ఇద్దరు పిల్లలను పావులుగా వాడుకుని డబ్బు కోసం ప్రయత్నించేదని ఆరోపించాడు. అయితే సంజయ్ ఆరోపణలను కరిష్మా లాయర్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని … తాము చెప్పాల్సింది కోర్టుకే చెబుతామన్నారు. మీడియా ద్వారా వాదనలు వినిపించడం తమకు ఇష్టం లేదన్నారు.

First Published:  17 Jan 2016 8:28 AM GMT
Next Story