Telugu Global
Others

మావాడు ఆడవాళ్లతో జలకాలాడలేదు..!

తిరుపతి ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి కేసులో తన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైసీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి చిత్తూరు జిల్లా గాజులమండెం వద్ద జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాల్‌మనీ, ఇసుక దందా నిందితుల జోలికి వెళ్లని చంద్రబాబు ఏ తప్పు చేయని మిథున్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు డబ్బులు […]

మావాడు ఆడవాళ్లతో జలకాలాడలేదు..!
X

తిరుపతి ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి కేసులో తన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైసీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి చిత్తూరు జిల్లా గాజులమండెం వద్ద జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాల్‌మనీ, ఇసుక దందా నిందితుల జోలికి వెళ్లని చంద్రబాబు ఏ తప్పు చేయని మిథున్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు డబ్బులు వచ్చే వ్యవహారాలను చూసిచూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు. మిథున్‌రెడ్డిని తనకుమారుడైనా ఏనాడు నెత్తికి ఎక్కించుకోలేదన్నారు. క్రమశిక్షణతో పెంచానని ఈ విషయంలో జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వారిలాగా తన కుమారుడు విదేశాలకు వెళ్లి మహిళలతో జలకాలాడలేదని, స్విమ్మింగ్‌లు చేయలేదన్నారు. మహిళలతో కలిసి మద్యం సేవించలేదన్నారు. విహారయాత్రలకు వెళ్లి చేయకూడని పనులేవీ మిథున్‌ చేయలేదని అన్నారు. భగవంతుడున్నాడని చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. అయితే మహిళలతో జలకాలాడలేదు, విహారయాత్రల్లో చేయకూడని పని చేయలేదన్న వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా లోకేష్‌ను పెద్దిరెడ్డి టార్గెట్ చేశారని చెబుతున్నారు. ఆ మధ్య లోకేష్ విదేశాల్లో మహిళలతో కలిసి మద్యం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దెత్తున హల్‌చల్ చేశాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

Click to Read:

cbn

jayasudha-tdp1

First Published:  16 Jan 2016 11:36 PM GMT
Next Story