Telugu Global
Others

గాలి బెయిల్ న్యాయమూర్తి మృతి " కారణం ఏమిటి?

మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి లంచం తీసుకుని బెయిల్‌ మంజూరు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ  మాజీ న్యాయమూర్తి ప్రభాకరరావు మృతిచెందారు. బెయిల్‌ స్కామ్‌లో సస్పెండ్‌ అయిన ప్రభాకర్‌రావు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. తొలుత ఆత్మహత్య చేసుకున్నట్టు అందరూ భావించారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసంలో ఆయన మృతి చెందారు. తనను కేసులో అన్యాయంగా ఇరికించారని దీనిపై  ప్రభాకర్‌రావు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇంతలోనే ఆయన  తనువు చాలించారు.  మృతదేహం గాంధీ […]

గాలి బెయిల్ న్యాయమూర్తి మృతి  కారణం ఏమిటి?
X

మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి లంచం తీసుకుని బెయిల్‌ మంజూరు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ న్యాయమూర్తి ప్రభాకరరావు మృతిచెందారు. బెయిల్‌ స్కామ్‌లో సస్పెండ్‌ అయిన ప్రభాకర్‌రావు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. తొలుత ఆత్మహత్య చేసుకున్నట్టు అందరూ భావించారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసంలో ఆయన మృతి చెందారు. తనను కేసులో అన్యాయంగా ఇరికించారని దీనిపై ప్రభాకర్‌రావు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇంతలోనే ఆయన తనువు చాలించారు. మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Click to Read:

somireddy-anam

First Published:  17 Jan 2016 11:23 PM GMT
Next Story